వైసీపీ లోకి ఎన్టీఆర్ మామ..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడి ఎక్కుతున్నాయి. ముఖ్యం గా తెలుగుదేశం పార్టీ నుండి ఏ క్షణాన ఏ నేత వెళిపోతాడో తెలియడం లేదు. ఇప్పటికే టీడీపీ నుంచి ప్రతిపక్షం వైసీపీలోకి ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటూ నియోజవర్గ స్థాయి నేతలు జంప్ అవ్వగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు జగన్‌ను కలవడం సర్వత్రా చర్చ గా మారింది.

సోమవారం నార్నె శ్రీనివాసరావు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వెళ్లారట. గంట సేపు జగన్ తో భేటీ అయినట్లు తెలుస్తుంది. బయటకొచ్చిన శ్రీనివాసరావు ను మీడియా ప్రశ్నించిదట. ఎందుకు కలిశారని అడగ్గా.. మర్యాద పూర్వకంగానే కలిశానని బదులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారట. శ్రీనివాసరావు మాటలు చూస్తే అతి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.