ఎన్టీఆర్ సీఎం అంటూ ప్లెక్సీ..

శాసన సభ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ వైసీపీ చేతిలో చిత్తుగా ఓడిపోయినా సంగతి తెలిసిందే. ఈ ఓటమి తర్వాత చాలామంది తెలుగుదేశం నేతలు ఇతర పార్టీల్లో చేరగా..తెలుగు దేశం పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావాలంటే చంద్రబాబు వల్ల కాదని అంత డిసైడ్ అయ్యారు. బయటకు వచ్చిన నేతలు , కార్య కర్తలు సైతం మళ్లీ తెలుగు దేశం పార్టీ కి వెలుగు నింపే సత్తా ఒక్క జూ. ఎన్టీఆర్ కే ఉందని చెపుతూ వచ్చారు. తాజాగా నెక్స్ట్ సీఎం ఎన్టీఅరే అంటూ ఓ ప్లెక్సీ వెలుగులోకి రావడం హాట్ టాపిక్ అయ్యింది.

సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెలంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ బూదాల అజితారావుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అందులో తమ పార్టీ నేతల ఫోటోలను ముద్రించారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం.. 2024 ముఖ్యమంత్రి అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ప్లెక్సీ వైరల్ గా మారింది.