టీడీపీకి మరో ఎంపీ షాక్ ఇవ్వబోతున్నాడా..?

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కి వరుస నేతలు షాక్ ఇస్తూ నిద్ర లేకుండా చేస్తుండగా..తాజాగా మరో ఎంపీ పార్టీ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీ పార్టీ ని విడి వైసీపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడనే సమాచారం. అమలాపురం నుంచి మళ్లీ ఎంపీ టికెట్‌ ఇచ్చేందకు టీడీపీ ససేమిరా అనడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని.. ఈక్రమంలో ఆయన వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తెలుస్తోంది.

ఈరోజు కానీ రేపు కానీ వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయి ఆ పార్టీలో రవీంద్రబాబు చేరుతారని సమాచారం. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కుడోచోట ఎస్సీ రిజర్వడ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే బీజీపీ నేత కావూరి సాంబశివరావు కూడా వైసీపీ లో చేరబోతున్నారు. ఇలా రోజుకో నేత వైసీపీ లో చేరుతుండడం తో ఆ పార్టీ బలం మరింతగా పెరుగుతుంది. ఇంకా పలువురు నేతలు వైసీపీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.