పవన్ కర్నూల్ టూర్ ఉద్రికత్త..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ( ఫిబ్రవరి 12 ) కర్నూల్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 2017లో అత్యాచారానికి గురై అనుమానాస్పద రీతిలో మరణించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ ర్యాలీ మొదలుపెట్టారు. రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకు పవన్ ర్యాలీ చేపట్టారు. అయితే పవన్ పర్యటనను అడ్డుకునేందుకు రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతల ప్రయత్నించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు.

గో బ్యాక్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమకు పవన్ అన్యాయం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో కర్నూలు కలక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పవన్ పర్యటన చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి(#justiceforSugaaliPreethi) హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.