బ్రదర్ రాజా..నీకు ఇది అవసరమా ..?

ఆనంద్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజా..ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. కొత్త హీరోల రాకతో రాజాకు అవకాశాలు తగ్గాయి. దీంతో సినిమాలను వదిలి క్రైస్తవ యువతిని పెళ్లి చేసుకునిదేవుని వాక్యాన్ని భోధిస్తూ.. అంతర్జాతీయ సువార్తీకుడిగా మారారు. తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ ఫై ఘాటైన వాక్యాలు చేసి విమర్శల పాలవుతున్నారు.

‘ఎవరు నువ్వు.. నువ్వేమైనా ‘మెస్సయ్య’ (దైవదూత-జీసన్‌ను మెస్సయ్యగా పిలుస్తారు) అనుకుంటున్నావా? లోకరక్షకుడివా నువ్వు. ఎందుకయ్యా నీకు అంత అహంకారం. ప్రజల మధ్యలోకి వెళ్లి కనీసం వారం రోజుల పాదయాత్ర చేయయ్యా.. పవన్ కళ్యాణ్ కనీసం అప్పుడైనా వాళ్ల బాధ నీకు తెలుస్తోంది. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల ఆవేదనను తెలుసుకుని అప్పుడు మాట్లాడండి’ అంటూ ఫైర్ అయ్యారు. వైరల్ అవుతున్న వీడియో చూసిన అభిమానులు , జనసేన కార్య కర్తలు నీకు అవసరమా బ్రదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.