రేపు అసెంబ్లీ కి టీడీపీ దూరం..ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం జరిగే సమావేశాలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుంది. శాసనమండలిని రద్దు చేసేందుకే వైసీపీ ప్రభుత్వం డిసైడ్ కావడం తో ఈ మేరకు రేపు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో టీడీపీ దానికి దూరంగా ఉంటుంది.

ఈరోజు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన చంద్రబాబు… రేపటి అసెంబ్లీ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేయడంతో… చంద్రబాబు కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.