దిశ బిల్లుకు టీడీపీ మద్దతు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ చారిత్రాత్మక బిల్లు దిశ -2019 బిల్లును ఆమోదించింది. ప్రతిపక్షం టీడీపీ కూడా బిల్లుకు మద్దతు తెలిపారు.. బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మనేని సీతారాం ప్రకటించారు. కాగా ఈ బిల్లు ఫై చంద్రబాబు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసారు.

ఈ బిల్లును తాము స్వాగతిస్తున్నామని.. దీన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో.. వాటిని అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయడ్డారు. ఇప్పటికే దేశంలో ఉన్న కొన్ని చట్టాలను అధ్యయనం చేసి అవసరమైతే కేంద్రాన్ని కూడా సంప్రదించాలని సూచించారు.

అంతకముందు హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ బిల్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దేశంలోనే తొలిసారిగా మహిళలకు భద్రత కల్పించేలా.. ఈ చారిత్రక బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం తనకు దొరికిందన్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.