పవన్ తో రాధాకృష్ణ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలే మారిపోతున్నాయి. ఎవరు ఏక్షణాన పార్టీ మారుస్తారో అర్ధం కానీ పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం పార్టీలో చేరగా..మరికొంతమంది ఎమ్మెల్యే లు ఇదే బాటలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరుపున ప్రచారం చేసిన వంగవీటి రాధాకృష్ణ..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది.

విజయవాడలో ఉన్న పవన్ ను కలిసిన వంగవీటి రాధా.. దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపారు. ఇక, వంగవీటి రాధా.. జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీలో చేరే విషయంపై చర్చించడానికే ఆయన పవన్‌తో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీకి గుడ్‌బై చెప్పి సైకిలెక్కారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకపోయినా… టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడం తో..జనసేన లో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. మరి నిజంగానే రాధాకృష్ణ జనసేనలో చేరుతారా లేదా అనేది చూడాలి.