శనివారం ఏపీ కరోనా అప్డేట్ ..

ఏపీలో కరోనా ఉదృతి ఏ స్థాయి లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకు కొత్త కేసులే కాదు భారీ సంఖ్యలో మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. కరోనా బారిన సామాన్య ప్రజలే కాక రాజకీయ నేతలు సైతం భారీగా పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 2,17,040కి చేరాయి.

గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 10,080 కొత్త కరోనా కేసులు, 97 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు క‌రోనా బారినపడిన వారి సంఖ్య 2,17,040కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2461 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు 434 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల్లో 9,151 మంది కరోనాను జయించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,29,615 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 85,486 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జిల్లాల వారీగా కేసులు చూస్తే..