టీడీపీ కి ఛాలెంజ్ విసిరిన అవంతి

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీ కి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్ లో ఆస్తులున్న టీడీపీ నాయకులను కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు బెదిరించి వైసీపీలో చేర్పిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఇటీవలే వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ స్పందించారు. ‘హైదరాబాద్ లో నాకొక్కడికే ఆస్తులున్నాయా? టీడీపీ నేతలకు లేవా?’ అని ప్రశ్నించారు.

ఎనభై శాతం నాయకులకు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తనతో మాట్లాడారని, బెదిరించారని చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.

కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన అవంతి శ్రీనివాస్ కు జగన్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఆయనను భీమిలి నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. అవంతికి భీమిలీ అసెంబ్లీ పగ్గాలను అప్పగిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం నుంచి ఓ ప్రకటన వెలువడింది