కరోనాతో బాచుపల్లి ఎస్సై మృతి..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతూనే మరణాల సంఖ్య సైతం పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలే కాక ఉన్నత స్థాయి వ్యక్తులు సైతం దీనిబారిన పడి కన్నుమూస్తున్నారు. తాజాగా బాచుపల్లి ఎస్సై యూసుఫ్ కరోనా మృతి చెందాడు.

గత 15 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన పరిస్థితి విషమించడతో ప్లాస్మా థెరపీ కూడా చేసినట్లు సమాచారం. యూసుఫ్‌కు ప్లాస్మా అవసరం అని తెలియడంతో.. చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సాయి కుమార్ అనే కానిస్టేబుల్ ముందుకొచ్చాడు. బక్రీద్ రోజునే ప్లాస్మా దానం చేశాడు. ఓ ముస్లిం ఎస్సైకి హిందూ కానిస్టేబుల్ ప్లాస్మా దానం చేయడం.. అది కూడా బక్రీద్ రోజున కావడంతో.. దీన్ని మతసామరస్యానికి ప్రతీకగా పేర్కొన్నారు.