జగన్ వస్తే వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది

తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వస్తే ఆయన తండ్రి వైఎస్‌ఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు కు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ఆకృతి మార్పు, అవకతవకలకు పరోక్షంగా బాధ్యులు అవుతారని ఈ లేఖలో వివరించారు.

టెండర్ల వివరాలు జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందు పెడతామన్న జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలోనూ అదే తరహాలో టెండర్ల వివరాలు జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందు ఉంచాలన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల వివరాలు జ్యుడీషియల్‌ కమిషన్‌ ముందు ఉంచాలని భట్టి డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌ ను ఆహ్వానించారు.