ఎంపీ కాళ్లు కడిగిన నీళ్లను తీర్థంలా పుచ్చుకున్నాడు


జార్ఖండ్‌లోని గొడ్డా నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ మీటింగ్‌లో దూబే ప్రసంగించారు. అయితే ఇక్కడో ఒక అనూహ్య సంఘటన జరిగింది. ఆ బీజేపీ ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీళ్లను తీర్థంలా పుచ్చుకున్నాడు ఓ కార్యకర్త. అయితే అక్కడున్న వారంతా చప్పట్లతో అభినందిచడం మరొక వింత.

అయితే అక్కడ జరిగిన ఆ వింతను సదరు ఎంపీ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేయడంతో పాటు, జార్ఖండ్‌లో అతిథులకు ఎప్పట్నుంచో చేస్తున్న సంప్రదాయం ఇది అని , మహాభారతంలో కుచేలుడి కాళ్లను శ్రీకృష్ణుడు కడుగుతాడు అని గుర్తు చేసిన ఎంపీ.. తాను కూడా ఏదో రోజు పవన్ కాళ్లను కడుగుతానని దూబే పేర్కొనాడంతో వివాదాస్పదమైంది. మొత్తానిక దూబే పోస్టుపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.