అందులో తప్పేముందన్న చంద్రబాబు

ఓ ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టుకుంటే తప్పేముంది? అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ అభ్యర్థులు, ఇతర ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన విజయసాయి రెడ్డి రాసిన లేఖపై స్పదించారు, ఓ ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టుకుంటే తప్పేముంది? మరి, ప్రధానమంత్రి మాత్రం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించుకోవచ్చా? అని నిలదీశారు. ఆయనకు నిబంధనలు వర్తించవా? అని అడిగారు.

ఏపీలో టీడీపీ 100 శాతం కాదు, 1000 శాతం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, రాష్ట్ర చరిత్రలో ఇంత చెత్త ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, అధికారులకు శిక్షణ ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహించి అప్రదిష్ఠపాలయ్యారని విమర్శించారు. ఎన్నికల తర్వాత కూడా అసంబద్ధ నిర్ణయాలతో ఎన్నికల సంఘం అభాసుపాలవుతోందని విమర్శించారు.