జనసేన లోకి చదలవాడ ..

రోజు రోజుకు జనసేన పార్టీ లోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. మొదటగా పవన్ తో మొదలైన ఈ పార్టీ మెల్ల మెల్లగా తన బలాన్ని పెంచుకుంటుంది. ఈ మధ్య పవన్ పూర్తిగా తన సమయాన్ని అంత పార్టీ కార్య క్రమాలపైనే పెడుతుండడం తో జనాల్లోకి వెళ్తూ వారి సమస్యల ను అడిగి తెలుసుకుంటూ ఉండడం తో జనాల్లో , అలాగే మిగతా నాయకుల్లో సైతం పార్టీ ఫై అలాగే పవన్ ఫై నమ్మకం పెరుగుతుంది. దీంతో చాలామంది జనసేనలోకి చేరుతున్నారు.

మొన్నటి మొన్న మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేనలో చేరగా… ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ను కలిసిన చదలవాడకి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.