చత్తీస్ గఢ్ గవర్నర్ బలరామ్ దాస్ టాండన్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనను ఈరోజు రాయపూర్ ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 ఏళ్లు.
టాండన్ మృతిపై చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు, రాష్ట్రానికి తీరని లోటు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజానికానికి టాండన్ తండ్రిలాంటి వారని.. జనాల హృదయాల్లో కలకాలం నిలిచిపోతారని రమణ్ సింగ్ తెలిపారు. టాండన్ కుటుంబానికి ప్రభుత్వం చేదోడువాదోడుగా ఉంటుందని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.
చత్తీస్గఢ్ గవర్నర్గా టాండన్ 2014 జులైలో బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ డిప్యూటీ సీఎంగా కూడా ఈయన పనిచేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు