కామెంట్స్ చేసి ధర్నాకి దిగిన చింతమనేని

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరులో అనుచరులతో ధర్నాకు దిగారు. సోషల్‌మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని , తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారంటూ ఎస్పీకి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు.

చింతమనేని ప్రభాకర్ దళితులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ వీడియోలో చింతమనేని దళితులను ఉద్దేశించి, “మీరు దళితులు, మీరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, మీరు వెనుకబడిన తరగతుల వాళ్ళు, రాజకీయాలు మాకు ఉంటాయి, మాకు పదవులు, మీకెందుకు రా పిచ్చముండా కొడకల్లారా ” అంటూ చేసిన వ్యాఖ్యలకి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై చింతమనేని తన నిరసన వ్యక్తం చేశారు. ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, దళితులు బాధపడేలా తాను మాట్లాడలేదని , తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్టు చెప్పారు.