తెలంగాణ మంత్రికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజలే కాక సినీ , రాజకీయ నేతలు సైతం దీనిబారిన పడుతూ మరణిస్తున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కి కరోనా సోకింది. ఇటీవల మంత్రికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

ఇక‌, మ‌ల్లారెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు, ఆయ‌న‌కు స‌న్నిహితంగా మెలిగిన‌వారిని గుర్తించి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మృతుల సంఖ్య 615కి పెరిగింది. కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330కి చేరింది. ప్రస్తుతం 21417 మంది చికిత్స పొందుతున్నారు.