జగన్’కు గంటా సవాల్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని సవాల్ చేశాడు మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖలో మంత్రి గంటా భీమిలి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. జగన్‌ భీమిలి నుంచి పోటీ చేయాలని సవాల్‌ చేశారు. భీమిలి ఎమ్మెల్యేగా లక్ష మెజార్టీతో విజయం సాధిస్తానన్నారు. భీమిలిలో సామాన్య కార్యకర్తను కూడా కదిలించలేని దుస్థితి వైసీపీదని ఎద్దేవా చేశారు.

మరోవైపు, ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. టికెట్ ఖరారు చేసుకొనే ప్రయత్నంలో నేతలు ఉన్నారు. టికెట్ ఖరారు కాని నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపీ కి భారీ వలసలు జరుగుతున్నాయి. టికెట్ ఖరారైన నేతలు ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. తాజాగా, గంటా కూడా భీమిలీలో ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. ఏకంగా జగన్ నే సవాల్ చేశారు. మరీ.. గంటా సవాల్ ని స్వీకరించి జగన్ భీమలి నుంచి రంగంలో దిగుతారేమో చూడాలి.