గంటా గేమ్ స్టార్ట్ చేశాడు

మంత్రి గంటా శ్రీనివాస్ ఏపీసోడ్ ఇటీవల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మనస్థాపం చెందిన గంటా కేబినేట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గంటాని చల్లబర్చాడు. ఆ వెంటనే జరిగిన సీఎం విశాఖ పర్యటనకు గంటా హాజరయ్యారు. దీంతో రాజీ కుదిరినట్టేననే ప్రచారం జరిగింది. ఐతే, గంటా ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు.

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మంత్రి గంటా సమావేశమయ్యారు. ఆనంతో గంటా భేటీ జరగడం.. కొత్త రాజకీయ సమీకరణాలకు ఆస్కారమిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే ఆనం వివేకానందరెడ్డి మరణించారు. పరామర్శించడానికే రామనారాయణ రెడ్డి ఊరికి గంటా వెళ్లారని అంటున్నారు. పైకి చెప్పే కారణం ఇదే. కానీ, వ్యూహం మేరకే గంటాఅ ఆనంను కలిసి ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ మారడం గంటా అలవాటు. అది కూడా కచ్చితంగా అధికారంలోకి వచ్చే పార్టీ లేదా, కీలకంగా మారే పార్టీనే ఆయన ఎంచుకొంటారు. ఐతే, ఈసారి గంటా జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారమ్. ఆ గేమ్ ప్లాన్ లో భాగంగానే మాజీ మంత్రి ఆనం రామ్నారాయణని కలిసి ఉంటారని చెప్పుకొంటున్నారు.