కనకదుర్గగుడిలో వెండి సింహాల విగ్రహాల చోరీ..

ప్రముఖ పుణ్యక్షేత్రం కనక దుర్గగుడిలో వెండి సింహాల చోరీకి గురైనట్లు తెలుస్తుంది. అంతర్వేది రథం దగ్ధం ఘటన మరవక ముందే విజయవాడలో దుర్గమ్మ గుడిలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉత్సవ రథంపై మూడు వెండి సింహాలు మాయమైనట్లు తెలుస్తుంది. మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. దానిని కూడా పెకిలించేందుకు ప్రయత్నించి విఫలమయినట్లు తెలిసింది. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారు. ఈ లెక్కన రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైనట్లు సమాచారం.