జగన్ కు స్వీట్ తినిపించిన కేసీఆర్

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్‌తో కూడా అదే విధానం అవలంబిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్ ఆపై సతీసమేతంగా ప్రగతి భవన్ వెళ్లి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

జగన్ రాక విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ తన నివాసంలోంచి వెలుపలికి వచ్చి జగన్ కు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జగన్ దంపతులను సాదరంగా లోపలికి తీసుకెళ్లారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు జగన్ ను మనస్ఫూర్తిగా అభినందించిన కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. ఎంతో ఆప్యాయంగా జగన్ కు స్వీట్ తినిపించారు. అక్కడే ఉన్న తెలంగాణ స్పీకర్, ఇతర మంత్రులను జగన్ కు పేరుపేరునా పరిచయం చేశారు.