పోటీని ఖరారు చేసిన కమల్ హాసన్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రాజకీయాల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మక్కల్‌ నీది మయ్యం అనే పార్టీని స్థాపించిన కమల్ హాసన్ ఇప్పుడు రాజకీయాల దిశగా అడుగులుగు వేస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

‘2019 లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా. మక్కల్‌ నీది మయ్యం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు త్వరలోనే కమిటీని ఏర్పాటుచేయనున్నాం’ అని వెల్లడించారు.

తమిళనాడు అభివృద్ధే ధ్యేయంగా తమ పార్టీ ప్రచారం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా పొత్తుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కూటముల గురించే ఇప్పుడే చెప్పలేమని, అయితే తమిళనాడు డీఎన్‌ఏను మార్చేందుకు ప్రయత్నించే ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని కమల్‌ స్పష్టంచేశారు.