కేసీఆర్ ని మిస్ అవుతున్న చంద్రబాబు


దమ్ము, ధైర్యం ఉంటే జగన్, కేసీఆర్, మోదీ ముందుకు వచ్చి నేరుగా తనను ఎదుర్కోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. జగన్ ఫ్యాన్ కు స్విచ్ హైదరాబాద్ లో ఉంటే, దానికి కరెంట్ ఢిల్లీలో ఉన్న మోదీ ఇస్తారని ఎద్దేవా చేశారు. మోదీ కరెంట్ ఇచ్చినప్పుడు, కేసీఆర్ స్విచ్చేస్తేనే ఆ ఫ్యాన్ తిరుగుతుందని అన్నారు. ‌ తానేదో పరాక్రమవంతుడ్నని అనుకుంటున్నాడు కేసీఆర్. నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నాడు. మా ఆస్తులు కొట్టేసిన నువ్వేంటి, నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది? 5 కోట్ల మంది ప్రజలు నీకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు” అంటూ నిప్పులు చెరిగారు.

కాగా దినిపై కవిత స్పదించారు. రిటర్న్ గిఫ్ట్ విషయంలో చంద్రబాబుకు కంగారొద్దన్నారు. ఇవ్వాల్సిన సమయంలో కేసీఆర్ తప్పక ఇస్తారన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌ను చాలా మిస్ అవుతున్నారని కవిత ఎద్దేవా చేశారు. చంద్రబాబు విమర్శలన్నింటిపై కేసీఆర్ తప్పక స్పందిస్తారని కవిత స్పష్టం చేశారు.తాము ఎవరినీ పట్టించుకోబోమని, తెలంగాణను దెబ్బతీసే వారిని మాత్రం వదలమన్నారు