మారిన కేశినేని టార్గెట్…కానీ సుజనా నా లేక పీవీపీనా ?

నిన్నటి వరకూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను టార్గెట్ చేసుకుని, తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శల వర్షం కురిపించిన విజయవాట ఎంపీ కేశినేని నాని ఈ ఉదయం తన టార్గెట్ ను మార్చుకున్నారు. పేరు చెప్పలేదు కానీ పేరు లేకుండానే ఎవరినో టార్గెట్ చేశారు.

“నేను ఎవరికైనా ఏమి అయినా ఇవ్వాలి అని ఎవరి దృష్టికి వచ్చినా నా వద్దకు తీసుకువస్తే నేను చెల్లించడానికి సిద్దంగా వున్నానని వందల సార్లు చెప్పడం జరిగింది. ఎప్పటికీ దానికి నేను కట్టుబడి వున్నాను. నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే దేశానికి మంచి చేసినవాడివి అవుతావు” అని ఆయన ట్వీట్ పెట్టారు. ఆ తరువాత “ప్రబుద్ధుడుతో నీకున్న అక్రమ సంబంధం ప్రజలకి అర్థమయింది” అని మరో ట్వీట్ పెట్టారు.

అయితే నాని చేసిన ఈ తాజా వ్యాఖ్యలు టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీ సుజనా చౌదరి గురించేనని కొందరు అంటుంటే మరి కొందరు ఏమో లేదు అవి పీవీపీని ఉద్దేశించినవి అని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ ట్వీట్లు మాత్రం తెలుగుదేశం పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.