కోరుట్ల గురుకుల డిగ్రీ కళాశాలలో దారుణం..

కోరుట్ల గురుకుల డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది..ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 67 మందికి కరోనా సోకింది. కోరుట్ల గురుకుల డిగ్రీ కళాశాలలో 290 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 67 మంది విద్యార్థులతో పాటు 8 మంది అధ్యాపకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా అధికారులు తెలిపారు. మొదటి సంవత్సరం బుక్స్ తీసుకునేందుకు విద్యార్థులు నాలుగు రోజుల క్రితం కళాశాల హాస్టల్‌కు వెళ్లారు.

దీంతో ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేయించడంతో కరోనా కేసుల బయటపడ్డాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి భారీగా తగ్గినా సంగతి తెలిసిందే. కాకపోతే చలి తీవ్రత పెరగడం తో మళ్లీ కరోనా మహమ్మారి తన పంజా విసరడం స్టార్ట్ చేస్తుంది. అందుకే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ..ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.