ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజ్ గోపాల్ మరోసారి చతికిల పడ్డారు. ఆయన లెక్క మళ్ళీ తప్పింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో ఆయన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు లెక్క తప్పాయి. ఇప్పుడు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక సర్వేలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైందనందుకు చింతిస్తున్నట్టు చెప్పారు.
భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలని కోరారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైకాపా అధ్యక్షుడు జగన్కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. . ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని సూచించారు.