లాక్ డౌన్.. ఇలా ఎత్తండి


దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను సడలించేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ఆయన ఈ విషయంపై చర్చించారు.

కరోనా తీవ్రంగా ఉన్న ప్రాంతాలను మినహాయించి మిగతా అన్ని ప్రాంతాలకు వర్తించేలా ఆ కార్యాచరణ ఉండాలని మోదీ దిశానిర్దేశం చేశారు. ప్రధాని వ్యాఖ్యలను బట్టి దేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ యథావిధిగా కొనసాగుతుందని, మిగతా ప్రాంతాల్లో తీవ్రతను అనుసరించి ఆంక్షల సడలింపు ఉంటుందని తెలుస్తోంది.