టీడీపీ నేతలను తరిమి కొట్టాలని మావోయిస్టుల లేఖ..

మావోయిస్టుల లేఖ తెలుగుదేశం నాయకులను చెమటలు పట్టిస్తుంది. ఇటీవలే తెలుగుదేశం పార్టీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ఆయన ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ మావోయిస్టుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత చాలామందిలో భయం పట్టుకుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని ఏజన్సీ నాయకులు వణికిపోతున్న నేపథ్యంలో తాజాగా మావోయిస్టుల నుండి లేఖ రావడం హాట్ టాపిక్ అయ్యింది.

ఏవోబీలో కూబింగ్ జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. గాలికొండ ఈస్ట్ డివిజన్ ఏరియా కమిటీ కార్యదర్శి గోపీ పేరుతో ఈ లేఖ విడులైంది. చంద్రబాబు మోసపూరిత ప్రకటనలతో మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, టీడీపీ నేతలను తరిమి కొట్టాలని ఆ లేఖ లో రాయడం జరిగింది. క్వారీల ముసుగులో టీడీపీ నేతలు, బంధువులు మన్యాన్ని ధ్వంసం చేస్తున్నారని , మన్యంలో లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తరలిస్తున్నారని, గిరిజన సంపదను దోచుకుంటున్నారని వారు లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై పోలీస్ యంత్రాగం ఎలా స్పందిస్తుందో చూడాలి.