మోదీ భారత పౌరుడేనా?

‘ప్రధాని మోదీ భారత పౌరుడేనా? భారతీయుడే అని నిరూపించుకునేందుకు ఆయన వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా?’ అంటూ కేరళలోని త్రిశ్సూర్‌ జిల్లా చాలాకుడీకి చెందిన జోషి అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు వేశారు. ఆయన దరఖాస్తును ఢిల్లీలోని కేంద్ర ప్రజా సమాచార అధికారికి పంపామని అధికారులు తెలిపారు. సీఏఏ గురించి వేలాది మంది ఆందోళన చెందుతున్నారని, ప్రజా ప్రయోజనార్థమే దరఖాస్తు చేశానని జోషి చెప్పారు.