అసలు మహిషాసురుడు జగనే

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ కి సవాల్ విసిరారు. ‘పసుపు’-కుంకుమ’ పథకాన్ని హేళన చేయటం జగన్‌ రాక్షసత్వానికి పరాకష్ట అని మండిపడ్డారు. ఈ పథకం తీరుతెన్నులపై జగన్‌ చేసిన విమర్శలకు మంత్రి తీవ్రంగా స్పందించారు. డ్వాక్రా పథకాల అమలు తీరుతెన్నులపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని.. జగన్‌ సిద్దమేనా అని సవాల్‌ విసిరారు.

జగన్‌ ఓ రాక్షసుడని.. రాక్షస కృత్యాలు చేయటం.. రాక్షస భాష మాట్లాడటంలో ఆయనకు మించినవారు లేరని సునీత విమర్శించారు. అసలు సిసలు మహిషాసురుడు జగనేనని.. అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు మహిషాసుర మర్దన చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో ‘జగనాసురుడు’ని మర్దించేందుకు మహిళలు మరోసారి సిద్దమవుతున్నారని అన్నారు.