అధికారం మనదే: పవన్ కళ్యాణ్


కుళ్లు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసే రాజకీయాల్లోకి వచ్చానని.. పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నికష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. . తమ పార్టీ ఉద్యమాలతో మిగిలిపోయేది కాదని.. ప్రజల మన్ననలతో అధికారం చేజిక్కించుకునేదని అన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా.. ప్రజల మనసులు గెలుచుకోగలిగామని చెప్పారు. రాజకీయాలు అవినీతి బురదతో నిండిపోయాయని.. దానిని మనమే శుభ్రం చేయాలన్నారు. భవిష్యత్తు రాజకీయాలను దిశానిర్దేశం చేసేది జనసేనే అని చెప్పుకొచ్చారు