ప్రకాశ్ రాజ్ పోటి ఖరారు


తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనన్నారు ప్రకాశ్‌రాజ్. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రకాశ్ రాజ్.. మూడు నెలలకు మించి నేను ఏ పార్టీలోనూ ఉండలేను అని చెప్పారు. జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. సిగ్గులేని వ్యక్తుల సమూహం అని మండిపడ్డారు.

గత లోక్ సభ ఎన్నికల్లో మోడీ ప్రధాని అయిన తరువాత నాకు చాలా గౌరవం పెరిగింది. కానీ ఈ ఐదేళ్లలో దారుణమైన పాలన చూశాను. జాతీయ సమగ్రతని దెబ్బతీసే అనేక చర్యలు జరిగాయి. బీజేపీ పార్టీ అనేది నీతిలేని వ్యక్తులతో కూడిన సమూహంగా మారిపోయింది. ఇలాంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు’ అని అభిప్రాయపడ్డారు ప్రకాష్ రాజ్.