ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ముఖ్యమంత్రి జగన్ ను అభినందించారు. ఫిరాయింపుదారులను కచ్చితంగా రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ చెప్పడం చాలా గొప్ప విషయమని అందుకు సీఎం జగన్ ని అభిమానిస్తున్నా అన్నారు నారాయణమూర్తి.’మార్కెట్ లో ప్రజాస్వామ్యం’ ‘అన్న సినిమా విజయయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు.
దేశంలో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని అన్నారు. నేడు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరును విమర్శించారు. నేతలు ఓట్లను ఏవిధంగా కొంటున్నారు.. ఎన్నికలు అయ్యాక ఫిరాయింపులకు పాల్పడుతున్న తీరును ఈ సినిమాలో చూపించానని నారాయణ మూర్తి వివరించారు.