రజనీ పార్లమెంట్’కు దూరం


సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కూడా త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారని భావించారు. ఐతే, అందుకు భిన్నంగా సూపర్ స్టార్స్ నిర్ణయం తీసుకొన్నారు. లోక్ సభ ఎన్నికలకి దూరంగా ఉండి.. 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కి దూరంగా ఉంటామ‌ని మొన్న క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌క‌టించారు. విమ‌ర్శ‌లు రాగానే ఆ డెసిష‌న్‌పై వెన‌క్కి త‌గ్గారు. తాజాగా, రజనీకాంత్ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కి త‌మ పార్టీ పోటీచేయ‌ద‌ని తేల్చేశారు. ర‌జ‌నీకాంత్ పార్టీ పెడుతాన‌ని ప్రకటించి 14 నెల‌ల దాటుతుంది. అయినా.. ఇప్పటివరకు పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయ‌లేదు. రజనీ తీరు చూస్తుంటే ఆయన లక్ష్యం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమేనని స్పష్టమవుతోంది. మొత్తంగా సూపర్ స్టార్స్ లోకల్ పొలిటికల్ స్టార్స్ గా మిగిలిపోయాలా ఉన్నారు.