ప్రధాని మోడీ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.నను అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనకు గాని, తన కుటుంబసభ్యులకు గాని ఎలాంటి హాని జరిగినా దానికి వీరే బాధ్యత అని హెచ్చరించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయ పన్నుశాఖ(ఐటీ) తనపైనా, తన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా దాడులకు సిద్ధమయ్యాయని.. ప్రణాళిక ప్రకారం కేంద్ర విచారణ సంస్థలు నిఘా కొనసాగిస్తున్నాయని ఆందోళన చెందారు. రెండు మూడు రోజుల్లో తనను అరెస్టు చేసేందుకు కచ్చితమైన ఆదేశాలున్నాయని.. తనకేమైనా జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్రావులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.