బీజేపీకి షాక్ ఇచ్చిన ఆరెస్సెస్ చీఫ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ బీజేపీకి షాక్ ఇచ్చారు. ఆయన ఎప్పుడూ లేనిది తొలిసారి కాంగ్రెస్ గొప్పదనాన్ని కొనియడారు. ‘భావి భారతం-ఆర్ఎస్‌ఎస్ దృష్టికోణం’పై ఆర్ఎస్ఎస్ మూడురోజుల లెక్చర్ సిరీస్‌ సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ.. “దాదాపు 80 నిమిషాలపాటు ప్రసంగించిన మోహన్ భగవత్ ఆరెస్సెస్ సేవలు నిరుపమానమని అన్నారు. ఆరెస్సెస్ తమ సిద్ధాంతాలను ఎప్పుడూ ఏ ఒక్కరిపైనా బలవంతంగా రుద్దదని స్పష్టం చేశారు. అదే సమయంలో స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ నిరుపమాన సేవలు అందించిందని కొనియాడారు. ఎందరో గొప్ప నేతలను దేశానికి అందించిందని పేర్కొన్నారు. ఆరెస్సెస్ చీఫ్ కాంగ్రెస్‌ను ప్రస్తుతించడం ఇప్పుడు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారింది.