పవన్ కళ్యాణ్ ను కలిసిన సోము వీర్రాజు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు. ఈ ఇద్దరు నేతలు పవన్ ఇంట్లో సమావేశమయ్యారు. వీర్రాజు మర్యాదపూర్వకంగానే జనసేనానిని కలిశారు. కొత్తగా బీజేపీ పగ్గాలు చేపట్టిన సోమును పవన్ అభినందించారు.. శాలువాతో సన్మానించారు.

నిన్నటి రోజున హైదరాబాద్ లో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మర్యాద పూర్వకంగానే సోము వీర్రాజు మెగాస్టార్ ను కలిశారు. రాజకీయాలకు సంబంధించిన కొన్ని అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు సాగుతున్నందుకు మెగాస్టార్ అభినందనలు తెలియజేశారు.

కాగా, ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎంపికయ్యాక పవన్ ను కలవడం ఇదే మొదటిసారి.