అరె.. నర్సన్న భలే కవర్ చేశాడే !

ఎన్నికల ఖర్చు విషయంలో మంత్రి నాయిని నర్సింహారెడ్డి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు ఓ అస్త్రంగా మారింది. గత ఎన్నికల సందర్భంగా తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ తనకు రూ. 10కోట్లు ఇస్తారని నాయిన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ అస్త్రంగా మార్చుకొన్నారు. నాయిని వ్యాఖ్యలని ఎన్నికల సంఘం సుమోటగా తీసుకొని కేసీఆర్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో నాయిని చాలా తెలివిగా తన వ్యాఖ్యలని కవర్ చేసుకొనే ప్రయత్నం చేశారు. లె లే.. తాను రూ.5 లేదా 10 లక్షలు ఇస్తారన్నారని చెప్పబోయి పొరపాటున రూ.10 కోట్లు అన్నానని తెలిపారు నాయిని. ఇక, ముషీరాబాద్‌ స్థానం నుంచి తన అల్లుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్న వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు. కేసీఆర్ తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నది వాస్తవం కాదు. ఫోన్ దినం మాట్లాడుకొంటాం అని తెలిపారు. మొత్తానికి నరసన్న భలే కవర్ చేసినట్టు కనిపిస్తుంది.