కట్టిపడేస్తున్న కారు ముగ్గు..

తెలుగు ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి ని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో చక్కగా జరుపుకొని..ఈరోజు సంక్రాంతి లో మునిగిపోయారు. సంక్రాంతి రోజు రంగురంగుల ముగ్గులు వేసే మహిళలు సిరిసిల్లలో సుమారు 200 మంది మహిళలు 2 ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు వేసి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

సంక్రాంతి పురస్కరించుకొని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కారు గుర్తు ముగ్గును వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును వేసి ఆశ్చ్ర్యపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ కారు గుర్తు ముగ్గు వేయడం స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది.