తెలంగాణ రాజకీయాల ఫై నోరు విప్పిన హీరోయిన్..

సీనియర్ నటి గౌతమీ తాజాగా తెలంగాణ రాజకీయాల ఫై నోరు విప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ కు దూరమైన ఈమె , రాజకీయాల ఫై మెల్లమెల్లగా అడుగులేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల ఫై స్పందించారు.

‘రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ భాగం పంచుకోవాలి. ఇక తెలంగాణలోని ముందస్తు ఎన్నికల కారణంగా అక్కడి ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా అనేది పక్కన పెడితే.. ప్రజలు ఓ పార్టీ అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిస్తే.. ఇలా ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయి ప్రజలకు మనం ఎంతవరకూ న్యాయం చేస్తామనేది ఆలోచించాల్సిన విషయం’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈమె మాటలు బట్టి చూస్తే త్వరలోనే ఈమె రాజకీయాల్లోకి రావడం ఖాయమనిపిస్తుంది.