మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికారపార్టీ టీఆరఎస్ విజయ డంఖా మోగించింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లో దాదాపు 107 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల తెరాస శ్రేణులు , కార్య కర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోవడం మరోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని రుజువు అయ్యింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవాలన్న బీజేపీ ఆశలు నెరవేరలేదు.
ఈ విజయం ఫై హరీష్ రావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్దేనని మరోసారి తెలంగాణ ప్రజలు రుజువు చేశారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభంజనమే వీసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అభినందనలు తెలియజేస్తున్నట్లు హరీశ్ రావు ట్వీట్ చేశారు. అలాగే పార్టీ విజయానికి కృషి చేసిన మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో TRS కు తిరుగులేని ఫలితాలు సాధించడంలో కష్టపడిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు అభినందనలు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్ సారధ్యంలోని ఒక్క టిఆర్ఎస్ కే సాధ్యమని చాటిన ప్రజానికానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
— Harish Rao Thanneeru (@trsharish) January 25, 2020
ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.
— Harish Rao Thanneeru (@trsharish) January 25, 2020