ఎంపీ కవిత తప్పు చేసింది..

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తప్పు చేసింది…తప్పు అంటే అదేదో అనుకోకండి..జస్ట్ ట్విట్టర్ లో చిన్న తప్పు చేసింది. దానిని వెంటనే సవరించాలని కోరింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పటినుండో భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. ఈ సందర్భాంగా ఆమెను అభినందిస్తూ అందరూ తమ తమ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విషెష్ అందిస్తున్నారు.

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా సింధుని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఫైనల్స్‌లో స్వర్ణం సాధించిన ఫస్ట్ ఇండియాకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో చిన్న తప్పు చేసింది. ఇది గమనించిన కవిత తన తప్పును సవరించమని ట్విటర్‌ను కోరారు. ‘ట్విటర్.. ప్లీజ్ నా తప్పుని సవరించు. ఫస్ట్ ఇండియన్‌’గా మార్చు అని మరో ట్వీట్ చేశారు.