తెలంగాణ రాష్ట్రంలో మరో దిశ ఘటన ..

హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం తో మరోసారి ఇలాంటి ఘటనలు జరగవని..ఆలా చేయాలన్న కామాంధులు వణికిపోతారని అంత భావించారు. కానీ అలాంటి ఘటనలు జరుగుతూనే ఉండడం అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి. తాజాగా దిశ ఘటన తిరుగానే జగిత్యాల జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే. వెల్గటూర్ మండలం కొండాపూర్‌లో పత్తి ఏరేందుకు పొలానికి వెళ్లిన వివాహిత తిరిగిరాకపోవడంతో.. గ్రామస్తులతో కలిసి కుటుంబసభ్యులు వెతికారు. దాంతో పొలాల్లో ఆమె మృతదేహం కనిపించింది.. ఆమె దుస్తులు ఓ చోట, మృతదేహం మరో చోట.. ఇక శరీరంపై పలు చోట్ల పంటి గాట్లు కనిపించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. 39 ఏళ్ల వివాహిత భర్త చనిపోవడం తో ఇద్దరు కూతుళ్లను పోషిస్తోంది వస్తుంది. బుధవారం తన చేనులో పత్తి ఏరేందుకు వెళ్లి.. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కూతుళ్లు ఆందోళన చెందిన కూతుళ్లు.. గురువారం ఉదయం చుట్టుపక్కలవారి సాయంతో పొలం దగ్గరకు వెళ్లి వెతికారు.. కొంత దూరంలో ఆమె మృతదేహం కనిపించింది. ఆమెపై సామూహికత అత్యాచారం చేసి, హతమార్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.