పవన్ ఫై తెలంగాణ లో కేసులు నమోదు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. రెండు రాష్ట్రాలు గా విడిపోయాక తెలంగాణ , ఆంద్రప్రదేశ్ ప్రజలు ఎంతో సంతోషంగా జీవిస్తుంటే,,వారి మధ్య విభజన బేధాలు..గొడవలు వచ్చేలా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చేస్తున్నారని..తెలంగాణ రాష్ట్ర ప్రజలు మండిపోతున్నారు.

ఇప్పటికే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేసులు పెడుతుండగా..తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ నేతలు ఆయనపై ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలపై దాడులు చేస్తున్నారని.. తెలంగాణ ఏమైనా పాకిస్తానా అని పవన్‌ రెచ్చగొట్టేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏ ఆంధ్రావారి భూములు లాక్కున్నారో చెప్పాలని ప్రశ్నించిన జేఏసీ నేతలు.. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకోమని అంటున్నారు.