తెలంగాణ లో రాహుల్ పర్యటన డీటెయిల్స్..

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని గెలుపు బాటలో నిలబెట్టేందుకు రాహుల్ నడుం బిగించారు. తెలంగాణ లోని భైంసా, కామారెడ్డి ల్లో ఏర్పటు చేసిన భారీ బహిరంగ సభకు రాహుల్ హాజరు కానున్నారు.

ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు భైంసా కు చేరుకొని , 12.30 నుంచి 1.30 గంటల వరకు అక్కడి సభలో పాల్గొంటారు. అనంతరం కామారెడ్డి చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటలకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు వచ్చి 5 నుంచి 6 గంటల మధ్య చార్మినార్‌ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు.