గత 19 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సమ్మె జరుగుతుండగానే..కార్మికులు వేదనకు గురై ప్రాణాలు తీసుకోవడం..ప్రాణాలు పోవడం జరుగుతుంది. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మ హత్యలు చేసుకోగా..తాజాగా మరో కార్మికుడి గుండె ఆగింది.
ముషిరాబాద్ డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న రమేష్(37) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామానికి చెందిన రమేష్ గత 17 రోజులుగా సమ్మెలో చురుగ్గా పాల్గొన్నాడు. రెండు రోజుల గుండెనొప్పి రావడంతో మలక్పేటలోని యశోదా ఆస్పత్రిలో చేరాడు . చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. ఇలా ప్రాణాలు పోతున్న కానీ ప్రభుత్వం దిగిరావడం లేదని కార్మికులు మరింత ఆందోళన చేస్తున్నారు.