బండ్ల గణేష్ బయటికొచ్చాడోచ్..ఆ ఒక్కటి అడగకండి

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అత్యధికంగా ట్రోల్ కాబడిన నటుడు కామ్ కాంగ్రెస్ కార్య కర్త బండ్ల గణేష్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడ్‌తో పీక కోసుకుంటా అని పబ్లిక్ గా చెప్పడం తో ఈయన వార్తల్లో బాగా నిలిచారు. ఎలక్షన్ రిజల్ట్ తరువాత కాంగ్రెస్ ఓడిపోవడం తో జనాలతో పాటు నెటిజన్లంతా సోషల్ మీడియాలో ఆయన పీక ఫై జోకులు, కామెంట్స్‌ వేస్తూ గణేష్ పీకను పీస్ పీస్‌లుగా చేసారు. ఎలక్షన్స్ రిజల్ట్ తరువాత కనిపించకుండా పోయిన గణేష్…ఎట్టకేలకు ఈరోజు తిరుమల సన్నిధానం లో మీడియా కు చిక్కారు.

బండ్ల గణేష్ ను చూడగానే మీడియా అంత పరుగులు తీశారు..గణేష్ ను చూడగానే కాస్త నవ్వండి సార్.. ఎలా ఉన్నారు అని మీడియా పలకరిస్తే.. ‘ఏం నవ్వుతాం.. నవ్వే పరిస్థితా మాది.. ఒక ఓటమి విజయానికి పునాది. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.. అందర్నీ స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. నేను అజ్ఞాతంలో ఉన్నా అంటున్నారు. కాని నేను అజ్ఞాతంలో లేను. నేను అనుకున్న మా పార్టీ ఓడిపోయింది కాబట్టి రెండు మూడు రోజులు బాధతో బయటకు రాలేదు. మనం ఎన్నో ఊహించుకుంటాం.. కాకపోతే ప్రజలు తిరస్కరించారు. కాబట్టి మౌనంగా ఉన్నాం. ప్రజలు మా పక్షాన లేకపోవడం బాధ కలిగించింది. అయితే వారి నిర్ణయాన్ని కాదనలేం..అని గణేష్ చెప్పుకొచ్చాడు.

బ్లేడ్‌తో పీక కోసుకుంటా అన్నారు దాని ఫై మీ స్పందన ఏంటి అనగా..కోపంలో వంద అంటాం.. రాజకీయాల్లో చాలా మంది చాలా అంటారు అవన్నీ అవుతాయా? గెలవలేదు కరక్టే ఇప్పుడు ఏం చేయమంటారు? పీక కోసుకోలేంగా.. మా పార్టీ నాయకులకు కాన్ఫిడెన్స్ ఇద్దాం అని పీక కోసుకుంటా అన్నా.. ఆ కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది. ఏం చేస్తాం.. దేవుడి సన్నిధానంలో ఉన్నాం కాబట్టి కొన్ని ఇక్కడ మాట్లాడకూడదు మిగతావి తరువాత మాట్లాడతా’ అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.