కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ సోదాలు


హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం హీరో నాని, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు.. రాజకీయ నాయకులనూ టార్గెట్ చేశారు. తెరాసకు చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసం, కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి.

ప్రస్తుతం కూకట్‌పల్లి వెంకటరావునగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కృష్ణారావు కుమారుడు సందీప్‌రావుకు చెందిన ప్రణీత్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వ్యవహారంలో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.