తెలంగాణల్లో కొత్తగా 2159 కేసులు , 9 మంది మృతి..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2159 పాజిటివ్ కేసులు నమోదు కావడం తో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 9 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1005కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 53,094 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 23,29,316కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,443 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,33,555 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు చూస్తే..

ఆదిలాబాద్ 20, భద్రాద్రి కొత్తగూడెం 60, జీహెచ్ఎంసీ 318, జగిత్యాల 45, జనగాం 35, జయశంకర్ భూపాలపల్లి 22, గద్వాల్ 18, కామారెడ్డి 49, కరీంనగర్ 127, ఖమ్మం 77, ఆసిఫాబాద్ 13, మహబూబ్ నగర్ 24, మహబూబాబాద్ 84, మంచిర్యాల 33, మెదక్ 34, మేడ్చల్ 121, ములుగు 18, నాగర్ కర్నూల్ 27, నల్గొండ 141, నారాయణపేట 14, నిర్మల్ 29, నిజామాబాద్ 84, పెద్దపల్లి 47, రాజన్న సిరిసిల్ల 53, రంగారెడ్డి 176, సంగారెడ్డి 64, సిద్ధిపేట 132, సూర్యాపేట 66, వికారాబాద్ 22, వనపర్తి 23, వరంగల్ రూరల్ 39, వరంగల్ అర్బన్ 98, యదాద్రి భోనగిరిలో 46 కేసులు నమోదయ్యాయి.